Header Banner

మహిళా ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్! ఆ లిమిట్ ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ!

  Mon May 05, 2025 17:31        Politics

ఏపీలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే మహిళా ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెడతామని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో ఇవాళ మహిళా ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ ఒక దానిని పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు 120 రోజులు అంటే నాలుగు నెలలు మాత్రమే ఇస్తున్నారు. వీటిని ఇప్పుడు 180 రోజులకు అంటే ఆరు నెలలకు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న తరహాలోనే వీటిని 180 రోజులకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

మహిళా ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే ప్రసూతి సెలవు ప్రస్తుతం ఇద్దరు పిల్లల వరకూ మాత్రమే ఉండగా, ఈ లిమిట్ ను కూడా ఎత్తేస్తూ ప్రభుత్వం మరో నిర్యం తీసుకుంది. దీన్ని కూడా ఇదే జీవోలో వెల్లడించారు. తద్వారా ఎంతమంది పిల్లల్ని కన్నా ప్రసూతి సెలవులు మాత్రం యథావిథిగా వర్తించబోతున్నాయి. రాష్ట్రంలో జనాభా పెంపుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎక్కుమంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు పదే పదే ప్రభుత్వ కార్యక్రమాల్లో చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్ధాయిలోనూ ప్రోత్సాహక చర్యల్ని ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులు పెంచడంతో పాటు ఈ సెలవులు పొందేందుకు ఇప్పటివరకూ ఉన్న ఇద్దరు పిల్లల పరిమితిని కూడా ఎత్తేశారు.

ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

నేడు (5/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APGovt #ChandrababuNaidu #WomenEmployees #MaternityLeave #APNews #TeluguNews #EmployeeWelfare